EMRS Recruitment 2025: దేశవ్యాప్తంగా 7,267 పోస్టుల భర్తీ – నెలకు రూ.2 లక్షల వరకు జీతం!
టీచింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు భారీ అవకాశం వచ్చింది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో (EMRS) మొత్తం 7,267 ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాల కింద ప్రిన్సిపల్, PGT, TGT, హాస్టల్ వార్డెన్, ఫీమేల్ స్టాఫ్ నర్స్, అకౌంటెంట్, క్లర్క్, ల్యాబ్ అటెండెంట్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు కనీసం రూ.18 వేల నుండి గరిష్టంగా రూ.2 లక్షల వరకు వేతనం లభించనుంది.
ప్రిన్సిపల్గా ఎంపిక కావాలంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ, B.Ed.తో పాటు 8–12 సంవత్సరాల అనుభవం ఉండాలి. వీరికి నెలకు సుమారు రూ.2 లక్షల వరకు జీతం లభిస్తుంది. PGT పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీతో పాటు B.Ed. అర్హత కావాలి. TGT పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ, B.Ed.తో పాటు CTET అర్హత తప్పనిసరి. హాస్టల్ వార్డెన్ పోస్టులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ సరిపోతుంది. ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు B.Sc నర్సింగ్ లేదా సమానమైన అర్హత ఉండాలి. అకౌంటెంట్ పోస్టులకు కామర్స్/అకౌంట్స్లో డిగ్రీ అవసరం. క్లర్క్ (JSA) పోస్టులకు 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ నైపుణ్యం ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు సైన్స్తో 10వ లేదా 12వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.
వయో పరిమితి విషయానికి వస్తే అభ్యర్థులు కనీసం 18 ఏళ్లు నిండివుండాలి. గరిష్ట వయస్సు పోస్టుల ఆధారంగా 55 ఏళ్ల వరకు అనుమతిస్తారు. ఎంపిక విధానం రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. కొంతమంది పోస్టులకు స్కిల్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ నిర్వహిస్తారు. అవసరమైతే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. చివరగా ఆరోగ్య పరీక్ష అనంతరం తుది ఎంపిక చేస్తారు.
అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ nests.tribal.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అభ్యర్థులు అక్టోబర్ 23, 2025 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది.













